Spread the love

ధర్మవరం : పట్టణములోని వాసవి మాత దేవాలయంలో మంగళవారం ఆషాడ మాసం ప్రారంభంగా ఆర్యవైశ్యుల కులదైవమైన వాసవి మాతను గోరింటాకు అలంకరణలో శ్రీ వాసవి మహిళా మండలి ఆధ్వర్యంలో చక్కగా అలంకరించారు. ఈ సందర్భంగా అర్చకులు చంద్రశేఖర్ శర్మ, నారాయణ మూర్తి ప్రత్యేక పూజలను నిర్వహించారు. అనంతరం వాసవి మహిళా మండలి అధ్యక్షులు పోలమడ రూపా రాగిణి, కార్యదర్శి కాకుమాని కళ్యాణి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఈ గోరింటాకు అలంకరణలో భాగంగానే ఈ సంవత్సరం కూడా వాసవి దేవాలయంలో సాయంత్రం నిర్వహించడం జరిగిందన్నారు. ప్రత్యేక పూజలు అనంతరం గోరింటాకుతో అలంకరించబడిన వాసవి మాతను దేవాలయము వెలుపల, పట్టణంలోని పలు విధులలో ఊరేగింపు నిర్వహించామని తెలిపారు. పట్టణ ప్రజలందరూ కూడా కష్టాలు తొలగి, సుఖశాంతులతో ఉండాలని ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కోశాధికారి నల్లపేట మంజు సంయుక్త, ఉపాధ్యక్షులు శోభ, ప్రశాంతి,సహాయ కార్యదర్శి జ్యోతి, సంఘం సభ్యులు, అధిక సంఖ్యలో ఆర్యవైశ్య మహిళలు పాల్గొన్నారు.


Spread the love

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *