Spread the love

చిలకలపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన వాసవీ ఆర్య వైశ్య కల్యాణ మండపాన్ని విజయనగరం ఎమ్మెల్యే, ఆర్య వైశ్య సంఘం జిల్లా అధ్యక్షుడు కోలగట్ల వీరభద్రస్వామి గురువారం ప్రారంభించారు. ఇక్కడ ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వీరభద్రస్వామి మాట్లాడుతూ.. సేవాభావంతో సంఘ సభ్యులంతా దీన్ని నిర్మించడం విశేషమన్నారు.

సమస్యలను పరిష్కరించేందుకు సంఘ సభ్యులంతా రాజకీయాల్లో ఎదగాలన్నారు. ఐకమత్యంతో దేన్నైనా సాధించవచ్చని తెలిపారు. తన గెలుపునకు ఆర్యవైశ్య సంఘ సభ్యులు ఎంతో పాటుపడ్డారని వివరించారు.

కార్యక్రమంలో విజయనగరం పట్టణాధ్యక్షుడు శ్రీనివాసరావు, పార్వతీపురం మున్సిపల్ వైస్ ఛైర్మన్ గుండేశ్వర్ రావు, జిల్లా సంఘ బాధ్యులు వెంకటరమణ, జి.వెంకట్ రావు, పుండరీకాక్ష, వాసుదేవరావు, ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు.
</div>

Spread the love

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *