sri krishna janmastamisri krishna janmastami
Spread the love

*శ్రీకృష్ణ జన్మాష్టమి గోకులాష్టమి*

*శ్రీ కృష్ణాష్టమి_పండుగ_విశిష్టత_ఏంటి ? విధానం_ఏంటి ?*

కృష్ణుడి జీవితమే ఒక మానవ జీవన అనుభవసారం.. మూర్తీ భవించిన వ్యక్తిత్వ వికాసం..

శ్రీకృష్ణుని రూపం నల్లనిది.. మనసు మాత్రం వెన్న పూసలా తెల్లనిది..  దేనికీ భయపడని వ్యక్తిత్వంతో చేపట్టిన ప్రతీ పనిలోనూ విజయం సాధించాడు..

నమ్మిన వారికి కొండంత అండగా నిలిచాడు.

అసలు కృష్ణుడంటేనే అలౌకిక ఆనందానికి ప్రతిరూపం..  సచ్చిదానంద రూపం.. సత్‌చిత్ ఆనంద స్వరూపం.. పాపాల్ని నాశనం చేసేదే కృష్ణ తత్వం..

కృష్ఱుడి పేరు తలుచుకుంటేనే అమరత్వం సిద్ధిస్తుంది.. జవసత్వాలు ఉట్టి పడతాయి.. కృష్ణ నామం కర్ణపేయంగా ఉంటుంది..

శ్రీకృష్ణుడు, హిందూమతంలో అర్చింపబడే ఒక దేవుడు. విష్ణువు యొక్క పది అవతారాలలో ఎనిమిదవ అవతారము.

నందన నామ సంవత్సర దక్షిణాయాన వర్ష బుుతువు శ్రావణ బహుళ అష్టమి రోహిణీ నక్షత్రం నాలుగో పాదాన గురువారం నాడు అర్ధరాత్రి యదువంశంలో దేవకీదేవి, వసుదేవుల దంపతులకు శ్రీకృష్ణుడు జన్మించాడు.

*అందరికి అన్ని తానే అయ్యి…*

మన పురాణాలలోను, తాత్త్విక గ్రంథాలలోను, జనబాహుళ్యంలోని గాధలలోను, సాహిత్యంలోను, ఆచార పూజా సాంప్రదాయాలలోను కృష్ణుని అనేక విధాలుగా భావిస్తుంటారు, చిత్రీకరిస్తుంటారు.

చిలిపి బాలునిగాను, పశువులకాపరిగాను, రాధా గోపికా మనోహరునిగాను, రుక్మిణీ సత్యభామాది అష్టమహిషుల ప్రభువుగాను, గొపికల మనసు దొచుకున్నవాడిగాను, యాదవరాజుగాను, అర్జునుని సారథియైన పాండవ పక్షపాతిగాను, భగవద్గీతా ప్రబోధకునిగాను, తత్త్వోపదేశకునిగాను, దేవదేవునిగాను, చారిత్రిక రాజనీతిజ్ఞునిగాను ఇలా బహువిధాలుగా శ్రీకృష్ణుని రూపం, వ్యక్తిత్వం, దైవత్వం చిత్రీకరింపబడినాయి. కాని ఆ శ్రీకృష్ణుని గురించి ఇంకా ఎన్నో విశేషాలు తెలుసుకోవలసినవి మిగిలిపోతూనే ఉంటాయి, ఉన్నాయి.

*వెన్న ముద్దల దొంగ…*

ఈ బాలకృష్ణుడు ఇంటింటా తన స్నేహితులతో వెన్న ముద్దలు దొంగిలిస్తూ వెన్న దొంగగా ముద్రవేసుకున్నాడు.

అలా వెన్న ముద్దల దొంగతనంలో మానవులకు అందని దేవరహస్యం ఉందట. వెన్న జ్జానికి సంకేతంగా చెపుతుంటారు మన పెద్దలు.

 శ్రీకృష్ణుని తత్వం చాలా గొప్పది. బాల్యంలోనే తన లీలల ద్వారా భక్తులకు జ్ఞానోపదేశం చేశాడు. వెన్న ముద్దలు ఎక్కువ, ఇష్టంగా తినేవాడు.

వెన్న జ్ఞానానికి సంకేతం. వెన్న నల్లని కుండలలో కదా ఉండేది. ఆజ్ఞానికి సంకేతం నల్లని కుండ, వెలుగుకు, విజ్ఞానానికి చిహ్నం తెల్లని వెన్న. తన భక్తుల మనసులోని ఆజ్ఞానమనే చీకటిని తోలగించి, జ్ఞానమనే వెలుగును నింపడం కోసమే కన్నయ్య వెన్న తినేవాడు.

*అంతా క్రిష్ణమయం.*.. ఎందుకు మహిళలు కృష్ణ తత్వం ఎక్కువ ఇష్టపడతారంటే అందులో ప్రతీదీ సున్నితత్వం, ఆరాధనే దాని తత్త్వం.

 కృష్ణ తత్వం చదివిన వారికి నిజమైన ప్రేమ తత్వం తెలుస్తుంది. గోపాలుడు ఎక్కడా మహిళలతో పరుషముగా మాట్లాడినట్లు మనము చూడము. రుక్మిణి దేవి యొక్క భక్తి ఆరాధనను, సత్యభామ యొక్క గడసరి తనం, శక్తివంతమైన మహిళగా ఆమెపట్ల కూడా అదే సున్నితత్వం కనబరచడం లాంటివి ఎన్నో చెప్పుకోవచ్చు. అందుకే మహిళలు ఎప్పుడు అచలంచల ప్రేమతో అత్యంత సహనంతో జయించే కృష్ణతత్వంను ఇష్టపడతారు. ప్రజల దృష్టిలో ఎంత వీరుడు ధీరుడు మహా దేవుడు అయినా కూడ ఏ ప్రత్యేకత లేకుండా ఇంట్లో అత్యంత సాధారణంగా ఉండగలగడం ఆ కృష్ణ పరమాత్మకే చెల్లింది.

*రంగులమయం…*

నెమలి పింఛంలో ఏడు రంగులు ఉంటాయి. ప్రకృతిలో కనిపించే రంగులన్నీ ఈ ఏడు వర్ణాల సమాహారమే. అంతేకాదు లోకమంతా విస్తరించి ఉన్న ఆకాశం పగటి వేళ నీలవర్ణంతో, రాత్రివేళల్లో నల్లనివర్ణంతో ప్రకాశిస్తుంది. ఇన్ని రంగుల సమాహారమే ఆకాశం. సూర్యోదయంలో ఒక రంగు, సూర్యాస్తమయంలో మరొక రంగు కనిపిస్తుంది. ఈ రంగులన్నీ కాలానికి సంకేతం. కృష్ణపక్షం, శుక్లపక్షం అనే విభాగాలుగా చూసినా, కాలమంతా రంగులమయంగా కనిపిస్తుంది. ఇవన్నీ నెమలి పింఛంలో కనిపిస్తాయి. ఆ కాలానికి ప్రతీకగా శ్రీకృష్ణుడు నెమలి పించాన్ని ధరిస్తాడు.

*వేణుమాధవుడు…*

కన్నయ్య వేణువును విడిచిపెట్టి క్షణం కూడా ఉండలేడు. వేణువు, మాధవుల అనుబంధం ఎంత గొప్పదంటే…చివరకు గోపికలు కూడా వేణువును చూసి అసూయపొందారు. కన్నయ్య తమ కన్నా వేణువునే ఎక్కువగా ఆదరిస్తున్నాడని అలిగారు.

వాళ్ళందరు కలిసి వేణువుని అడిగితే ఇలా అందట… ‘నన్ను నేను గోపయ్యకు అర్పించుకున్నాను. నాలో ఏమీ లేదు. అంతా డొల్ల’ అంది. నిజమే! వేణువు అంతా శూన్యం. అంటే, పరిపూర్ణతకు చిహ్నం. తనకంటూ ఏమీ లేదు మనసులో ఏ మాలిన్యమూ, ఏ భావమూ, వికారమూ లేదు. తన సర్వస్వాన్నీ పరమాత్మకు అర్పించుకుంది. నేను, నాది అనే భావాలు వేణువుకు లేవు. ఏది తనదో అదే పరమాత్మకు ఇచ్చేసింది.

ఇప్పుడిక వేణువు, మాధవుడు ఇద్దరు కాదు… వేణుమాధవుడు మాత్రమే. మానవుడు అందుకోవాల్సిన మహత్తరమైన ఆధ్యాత్మిక సందేశాన్ని వేణువు అందిస్తుంది. నేను, నాది అనే వాటికి మనిషి దూరం కావాలి. తాను తానుగా మిగలాలి. తన స్వచ్ఛమైన మనస్సును మాధవుడికి అర్పించాలి. అలాంటి మనసున్న మనుషుల్ని పరమాత్మ అక్కున చేర్చుకుంటాడు.

*కృష్ణమేఘం…*

ఏ చిత్రాన్ని చూసినా, ఏ శిల్పాన్ని పరికించినా – కృష్ణుని సమ్మోహన దరహాసమే. ఉట్టిమీది పాలమీగడలు దొంగిలిస్తున్నప్పుడూ, అంతెత్తు గోవర్ధనగిరిని అమాంతంగా ఎత్తిపట్టుకున్నప్పుడూ, కాళీయుడి తలల మీద తకధిమి తకధిమి నాట్యం చేస్తున్నప్పుడూ, కంసచాణూరాది రాక్షసుల్ని వరుసబెట్టి వధిస్తున్నప్పుడూ, రణక్షేత్రంలో భీతహరిణంలా వణికిపోతున్న అర్జునుడికి గీతాబోధ చేస్తున్నప్పుడూ…అసలెప్పుడూ కృష్ణుడి మొహం మీద చిరునవ్వు చెదరలేదు. వ్యాసమహర్షి శ్రీభాగవతంలో రుతువర్ణన చేస్తూ…‘కృష్ణమేఘం’ అన్న మాట వాడారు. ఆ మేఘం వెంట వచ్చే మెరుపు కృష్ణయ్య చిరునవ్వేనట!

*మధురాధిపతే అఖిలం మధురం!*

కృష్ణుడు మధురకే కాదు,  ప్రేమ మాధుర్యానికీ అధిపతి.

మొత్తం మీద చెప్పాలంటే శ్రీకృష్ణుడు అంటే:

 • ఆనందతత్వం

 • ప్రేమతత్వం

 • స్నేహతత్వం

 • ప్రకృతితత్వం

 • నాయకత్వం

నీవే తల్లివి దండ్రివి 

నీవే నా తోడు నీడ! నీవే సఖుడౌ

నీవే గురుడవు దైవము

నీవే నా పతియు గతియు! నిజముగ కృష్ణా!

కృష్ణం వందే జగద్గురుమ్. సృష్టికర్త అయిన మహా విష్ణువు బ్రహ్మాండాన్ని ఉద్ధరించడానికి శ్రీ కృష్ణుడిగా ఎనిమిదవ అవతారమున జన్మించిన కృష్ణ జన్మాష్టమిని *”కృష్ణాష్టమి” , “గోకులాష్టమి”* లేదా అష్టమి రోహిణి అని పిలుస్తారు.

ఈ సంవత్సరం *స్మార్తులకు* ఆగస్టు 30 సోమవారం రోజున శ్రీకృష్ణామి. *వైష్ణవ సాంప్రదాయ* ప్రకారం తేదీ 31 మంగళవారం  రోజున శ్రీ కృష్ణ జన్మాష్టమిని జరుపుకుంటారు…

*స్మార్తులు* తిధితో పండగ జరుపుకుంటే , వైష్ణవులు నక్షత్రాన్ని దృష్టిలో పెట్టుకుని పుజిస్తారు.

శ్రీ కృష్ణుడు దేవకి వసుదేవులకు దేవకి ఎనిమిదో గర్భంగా శ్రావణ మాసము కృష్ణ పక్షం అష్టమి తిథి రోజు కంసుడి చెరసాలలో జన్మించాడు.

మహిమాన్వితమైన కృష్ణాష్టమి రోజు సూర్యోదయానికి ముందే (ఐదు గంటలకు ) నిద్ర లేచి , తలస్నానము చేసి మడి బట్టలు ధరించాలి.

తర్వాత ఇంటిని పూజా మందిరమును శుభ్రం చేసుకోవాలి, గడపకు పసుపుకుంకుమ , గుమ్మానికి తోరణాలు , పూజా మందిరములో ముగ్గులు వేయాలి.

*ఉపవాస దీక్షలు*

కృష్ణాష్టమి నాడు భక్తులు పగలంతా ఉపవాసం ఉండి , సాయం కాలం శ్రీ కృష్ణుని పూజిస్తారు.

శ్రావణ మాసంలో లభించే పళ్ళు , శొంఠి , బెల్లం కలిపిన వెన్న , పెరుగు , మీగడ స్వామికి నైవేద్యం పెడతారు. ఊయలలు కట్టి అందులో శ్రీకృష్ణ విగ్రహాల్ని పడుకోబెట్టి ఊపుతూ రకరకాల పాటలు , కీర్తనలు పాడతారు.

వీధుల్లో ఎత్తుగా ఉట్లు కట్టి పోటీపడి వాటిని కొడతారు.

అందుకే ఈ పండుగని *‘ఉట్ల పండుగ’ లేదా ‘ఉట్ల తిరునాళ్ళు’* అని పిలుస్తారు.

*పసుపు , కుంకుమ , గంధము , పుష్పాలతో*

పూజకు ఉపయోగించే పటములకు పసుపు , కుంకుమ గంధము , పుష్పాలతో అలంకరించుకోవాలి. పూజగదిలో ఓ మందిరమును ఏర్పాటు చేసుకుని శ్రీ కృష్ణుడు రాధతో గల ఫోటోను గానీ , ప్రతిమను ఉంచాలి. 

ఇంతలో పూజకు పసుపు రంగు అక్షింతలు , కదంబ పుష్పములు , తులసిమాల , సన్నజాజులతో మాల , నైవేద్యానికి పానకం , వడపప్పు , కమలాకాయలు వంటివి సిద్ధం చేసుకోవాలి.

*దీపారాధాన*

తదనంతరం మధ్యాహ్నం 12 గంటలకు పూజను ప్రారంభించాలి. కంచుదీపంలో కొబ్బరినూనె పోసి , ఐదు దూది వత్తులతో దీపమెలిగించాలి. దీపారాధనకు ఆవునేతితో హారతి సిద్దం చేసుకోవాలి.

నుదుటన సింధూరం ధరించి , తూర్పు దిక్కున తిరిగి , *’ఓం శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః’* అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి.

భక్తి శ్రద్ధలతో శ్రీకృష్ణ జయంతి వ్రతంగా ఆచరిస్తే గోదానం చేసిన ఫలితం , కురుక్షేత్రంలో సువర్ణ దానం చేసిన ఫలం దక్కుతుందని *బ్రహ్మాండ పురాణం* చెప్పింది.

 కలియుగంలో కల్మషాల్ని హరించి , పుణ్యాల్ని ప్రసాదించే పర్వదినం ఇదని కూడా వివరించింది.

*దీక్షతో దక్షత*

కృష్ణాష్టమి రోజున ఒంటి పూట భోజనం చేసి , శ్రీకృష్ణునికి పూజ చేసి , శ్రీకృష్ణ దేవాలయాలు , మఠములను దర్శించుకునే వారికి కోటి జన్మల పుణ్య ఫలం సిద్ధిస్తుందని పురాణాలు చెబుతున్నాయి.

ఆలయాల్లో కృష్ణ అష్టోత్తర పూజ , కృష్ణ సహస్ర నామా పూజ చేయించుకునే వారికి వంశాభివృద్ధి , అష్టైశ్వర్యాలు చేకూరతాయి.

ఈ రోజున కృష్ణుడిని పూజిస్తే సకల పాపాలు నశిస్తాయని , ధర్మార్థ కామ మోక్ష ప్రాప్తి కలుగుతుందని *స్కంధ పురాణం* చెబుతుంది.

సంతానం లేని వారు , వివాహం కావాల్సిన వారు ఈ పుణ్యదినాన బాల కృష్ణుడిని సంతాన గోపాల మంత్రంతో పూజిస్తే అనుకున్నది నెరవేరుతుంది.

ఓం నమో నారాయణాయ , నమోభగవతే వాసుదేవాయ సర్వం శ్రీకృష్ణ చరణార విందార్పణమస్తు !

*ఓం క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ రుక్మిణీ శాయ నమః !*

*ఓం అచ్యుతా అచ్యుతాహరే పరమాన్ రామకృష్ణ పురుషోత్తమ విష్ణు వాసుదేవభగవాన్ అనిరుధ్య శ్రీపతే శమయ దుఃఖమశేషం నమః !*

మంత్రముతో ఈరోజు ఎవరైతే 108 సార్లు ధ్యానం చేస్తుంటారో వారి , దుఃఖం హరించిపోతుంది.

గోకులాష్టమి దినాన ఇంటికి వచ్చే స్త్రీలకు తాంబూలముతో పాటు శ్రీ కృష్ణ నిత్యపూజ పుస్తకాలను అందజేస్తే.. సకల సంపదలు సిద్ధిస్తాయని విశ్వాసం.

హిందూ సంప్రదాయంలో కృష్ణుని ప్రత్యేకతే వేరు. తల్లులకు బాలకృష్ణునిగా , చిన్నవారికి చిలిపి కృష్ణునిగా , స్త్రీలకు గోపికా వల్లభునిగా , పెద్దలకు గీతాకారునిగా… ఇలా ప్రతి ఒక్కరి మదిలో ఏదో ఒక రూపాన కొలువై ఉంటాడు…

 అందుకే కృష్ణుని జన్మదినం అంటే మన ఇంట్లో మనిషి పుట్టినరోజు అన్నంత ఘనంగా నిర్వహించుకుంటాం.

కృష్ణునికి తులసి అంటే చాలా ఇష్టం. అందుకని పూజలో ఆచమనం చేసే నీటిలో తులసి ఆకులు వేసుకుంటే మంచిదని చెబుతారు.

ఆయన ప్రతిమను కూడా తులసిమాలతో అలంకరించమని సూచిస్తారు.

కృష్ణునికి పొన్నచెట్టుతోనూ అనుబంధం ఉంది. వీలైతే ఆ పొన్న పూలతో ఆయనను పూజిస్తే మంచిది.

ఆయనకు ఇష్టమైన తెలుపు లేదా పసుపు రంగు పూలతో పూజించినా శుభమే ! కృష్ణాష్టకమ్‌ , కృష్ణ అష్టోత్తరం వంటి స్తోత్రాలను చదువుతూ , పరిమళభరితమైన పుష్పాలతో ఆయనను అర్చించాలి.

కృష్ణాష్టమి రోజు పూజతో పాటుగా ఆయన స్మరణ కూడా ముఖ్యమే ! ఆ గోపాలుని వైభవాన్ని తెలియచేసే *భాగవతం , భగవద్గీతలను* ఈ రోజు ఎంతో కొంత పఠించాలి.

అలా కృష్ణుని తలుస్తూ , కొలుస్తూ , భజిస్తూ కృష్ణాష్టమి రాత్రిని గడపాలి.

కృష్ణుడు అర్ధరాత్రి జన్మించాడు కాబట్టి , కొందరు రాత్రివేళ్లే కృష్ణపూజ చేస్తారు.

అలా కృష్ణుని పూజించాలనుకునే ప్రదేశంలో బియ్యం పోసి…. దాని మీద ఒక కుండని పెడతారు.

ఆ కుండ మీద కృష్ణుని ప్రతిమను ఉంచి , పూజని నిర్వహిస్తారు. అర్ధరాత్రి వేళ శంఖంలో నీటిని తీసుకుని చంద్రునికి , కృష్ణునికి అర్ఘ్యమిస్తారు…

*ఓం నమో వేంకటేశాయ*             

*సమస్త లోకా సుఖినోభవంతు*

*సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

జైగిరిధారి!

కృష్ణుడిది అద్భుతమైన వ్యక్తిత్వం.
ఈ ఆధునిక కాలంలో మనిషి ఎలా జీవించాలో తను జీవించి చూపించాడు.
పుట్టడమే కారాగారంలో పుట్టి కింగ్ మేకర్ గా ఎదిగాడు. అర్తించిన వారికి అభయ హస్తం ఇచ్చాడు. బాల క్రీడ, రాసలీల, రణరంగం ఏదైనా సరె తనదైన ముద్ర వేసిన అద్భుత అనంత నిత్య చైతన్య మూర్తి ఆ కృష్ణ పరమాత్మ. కృష్ణాష్టమి రోజున ఆయన గురించి చిన్న క్విజ్ మీకోసం.

భాగవతం క్విజ్ – 1
https://edu.sriguru.org.in/bhagavatham-quiz-1/

భాగవతం క్విజ్ – 2
https://edu.sriguru.org.in/bhagavtham-quiz-2/

భాగవతం క్విజ్ – 3

https://edu.sriguru.org.in/bhagavatam-quiz-3/

* శ్రీకృష్ణుని గురించి అద్భుతమైన సమాచారం.*

*1).* శ్రీకృష్ణుడు 5,252 సంవత్సరాల క్రితం జన్మించాడు.

*2).* పుట్టిన తేది క్రీ. పూ. 18.07.3228

*3).* మాసం : శ్రావణం

*4).* తిథి: అష్టమి

*5).* నక్షత్రం : రోహిణి

*6).* వారం : బుధవారం

*7).* సమయం : రాత్రి గం.00.00 ని.

*8).* జీవిత కాలం : 125 సంత్సరాల 8 నెలల 7 రోజులు

*9).* మరణం: క్రీ పూ 18.02.3102

*10).* శ్రీకృష్ణుని 89వ యేట కురుక్షేత్రం జరిగినది

*11).* కురుక్షేత్రం జరిగిన 36సం. తరువాత మరణించెను.

*12).* కురుక్షేత్రం క్రీ.పూ. 08.12.3139న మృగసిర శుక్ల ఏకాదశినాడు ప్రారంభమై 25.12.3139 న ముగిసినది. క్రీ.పూ 21.12.3139న 3గం. నుంచి 5గం.లవరకు సంభవించిన సూర్య గ్రహణం జయద్రదుని మరణానికి కారణమయ్యెను.

*13).* భీష్ముడు క్రీ.పూ. 02.02.3138న ఉత్తరాయణంలో మొదటి ఏకాదశినాడు ప్రాణము విడిచెను.

*14).* శ్రీకృష్ణుడిని వివిధ ప్రాంతాలలో వివిధ నామాలతో పూజిస్తారు.

*అవి:-* మధురలో కన్నయ్య, ఒడిశాలో జగన్నాధ్, మహారాష్ట్ర లో విఠల (విఠోబ), రాజస్తాన్ లో శ్రీనాధుడు, గుజరాత్ లో ద్వారకాదీసుడు & రాంచ్చోడ్

ఉడిపి, కర్ణాటకలో కృష్ణ

*15).* జన్మనిచ్చిన తండ్రి వసుదేవుడు.

*16).* జన్మనిచ్చిన తల్లి దేవకీ

*17).* పెంచిన తండ్రి నందుడు

*18).* పెంచిన తల్లి యశోద

*19).* సోదరుడు బలరాముడు

*20).* సోదరి సుభద్ర

*21).* జన్మ స్థలం మధుర

*22). భార్యలు :-* రుక్మిణీ, సత్యభామ, జాంబవతీ, కాళింది, మిత్రవింద, నగ్నజితి, భద్ర, లక్ష్మణ

*23).* శ్రీ కృష్ణుడు జీవితంలో కేవలం నలుగురిని మాత్రమే హతమార్చినట్టు సమాచారం.

*వారు :-*

ఛణురా – కుస్తీదారుడు,

కంసుడు – మేనమామ

శిశుపాలుడు మరియు దంతవక్ర – అత్త కొడుకులు

*24).* శ్రీకృష్ణుని జీవితం కష్టాల మయం. తల్లి ఉగ్ర వంశమునకు, తండ్రి యాదవ వంశమునకు చెందిన వారు. వారిది కులాంతర వివాహం.

*25).* శ్రీ కృష్ణుడు దట్టమైన నీలపు రంగు కలిగిన శరీరముతో పుట్టాడు. తన జీవితం మొత్తం లో తనకి నామకరణ జరగలేదు. గోకులమంతా నల్లనయ్య / కన్నయ్య అని పిలిచేవారు. నల్లగా పొట్టిగా ఉన్నాడని, పెంచుకున్నరాని శ్రీ కృష్ణుడుని అందరూ ఆటపట్టిస్తూ, అవమానిస్తూ ఉండేవారు. తన బాల్యమంతా జీవన్మరణ పోరాటాలతో సాగింది.

*26).* కరువు, ఇంకా అడవి తోడేళ్ళ ముప్పు వలన శ్రీకృష్ణుని 9 ఏళ్ల వయసులో గోకులం నుంచి బృందావనం కి మారవలసి వచ్చింది.

*27).* 14-16 ఏళ్ల వయసు వరకు బృందావనం లో ఉన్నాడు. తన సొంత మేనమామ కంసుడిని 14-16 వయస్సులో మధుర లో చంపి తనను కన్న తల్లిదండ్రులను చెరసాల నుంచి విముక్తి కలిగించాడు.

*28).* తను మళ్ళీ ఏపుడూ బృందావనానికి తిరిగి రాలేదు.

*29).* కాలయవన అను సింధూ రాజు నుంచి ఉన్న ముప్పు వలన మధుర నుంచి ద్వారకకి వలస వెళ్ళవలసి వచ్చింది.

*30).* వైనతేయ తెగకు చెందిన ఆటవికులు సహాయంతో జరాసందుడిని గోమంతక కొండ (ఇప్పటి గోవా) వద్ద ఓడించాడు.

*31).* శ్రీకృష్ణుడు  ద్వారకాను పునర్నిర్మించారు.

*32).* విద్యాభ్యాసం కొరకు 16-18 ఏళ్ల వయసులో ఉజ్జయినిలో గల సాందీపని యొక్క అశ్రమంకు తరలివెళ్ళెను.

*33).* గుజరాత్ లో గల ప్రభాస అను సముద్రతీరం వద్ద ఆఫ్రికా సముద్రపు దొంగలతో యుద్ధం చేసి అపహరణకు గురి ఐన తన ఆచార్యుని కుమారుడగు పునర్దత్త ను కాపడెను.

*34).* తన విద్యాభ్యాసం తరువాత పాండవుల వనవాసమును గురించి తెలుసుకుని వారిని లక్క ఇంటి నుంచి కాపాడి తదుపరి తన సోదరి అగు ద్రౌపదిని పాండవులకు ఇచ్చి పెండ్లి చేసెను. ఇందులో చాలా క్రియాశీలంగా వ్యవహరించెను.

*35).* పాండవులు ఇంద్రప్రస్థ నగరమును ఏర్పాటు చేసి రాజ్యమును స్తాపింపజేసెను.

*36).* ద్రౌపదిని వస్త్రాపహరణం నుంచి కాపాడెను.

*37).* రాజ్యము నుండి  వెడలగొట్టునపుడు పాండవులకు తోడుగా నిలిచారు.

*38).* పాండవులకు తోడుగా ఉండి కురుక్షేత్రంలో విజయమును వరించునట్టు చేసెను.

*39). ఎంతో ముచ్చటగా నిర్మించిన ద్వారక నగరము నీట మునిగిపోవుట స్వయముగా చూసేను.

*40).* అడవిలో జర అను వేటగాడి చేతిలో మరణించెను.

*41).* శ్రీకృష్ణుడు ఎప్పుడూ అద్భుతాలు చెయ్యలేదు.

అతని జీవితం విజయవంతమైనదేమీ కాదు. జీవితములో ఒక్క క్షణం కూడా ఎటువంటి సంఘర్షణ లేకుండా ప్రశాంతముగా గడిపినది లేదు. జీవితపు ప్రతీ మలుపులో సంఘర్షణలు మాత్రమే ఎదుర్కొన్నాడు.

*43).* జీవితములో ప్రతీ వ్యక్తిని, ప్రతీ విషయాన్ని బాధ్యతతో ఎదుర్కొని చివరకు దేనికి / ఎవరికీ అంకితమవ్వలేదు.

అతను గతాన్ని, భవిష్యత్తును కూడా తెలుసుకోగల సమర్థుడు ఐనప్పటికీ తను ఏపుడు వర్థమానములోనే బ్రతికారు.

అతని జీవితము మానవాళికి ఒక నిజమైన ఉదాహరణ.


Spread the love

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *